TeluguTimesNews https://sample.webdigitalway.com Sun, 20 Jul 2025 11:06:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 తుపానులో చిక్కుకున్న పడవ…30 మంది జలసమాధి https://sample.webdigitalway.com/international/%e0%b0%a4%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%b5/ https://sample.webdigitalway.com/international/%e0%b0%a4%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%b5/#respond Sun, 20 Jul 2025 11:06:46 +0000 https://sample.webdigitalway.com/?p=1870 హాలాంగ్‌ బే(వియత్నాం): వియత్నాంలో అకస్మాత్తుగా విరుచుకుపడిన తుపానులో చిక్కుకుపోయిన ఒక పర్యాటకుల పడవ నీటిలో మునిగిపోయింది. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్‌ బే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం పడవ మునిగిన ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది జాడ గల్లంతైంది. విషయం తెల్సుకున్న వియత్నాం సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు తీవ్రతరం చేశాయి. 11 మందిని కాపాడారు. ప్రమాదం జరిగినప్పుడు ‘ది వండర్‌ సీ’బోటులో […]

The post తుపానులో చిక్కుకున్న పడవ…30 మంది జలసమాధి appeared first on TeluguTimesNews.

]]>
హాలాంగ్‌ బే(వియత్నాం): వియత్నాంలో అకస్మాత్తుగా విరుచుకుపడిన తుపానులో చిక్కుకుపోయిన ఒక పర్యాటకుల పడవ నీటిలో మునిగిపోయింది. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హా లాంగ్‌ బే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం పడవ మునిగిన ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది జాడ గల్లంతైంది. విషయం తెల్సుకున్న వియత్నాం సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు తీవ్రతరం చేశాయి. 11 మందిని కాపాడారు. ప్రమాదం జరిగినప్పుడు ‘ది వండర్‌ సీ’బోటులో 48 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. తుపాను కారణంగా పెనుగాలులు వీయడంతో ఆ గాలుల ధాటికి పడవ ఒక్కసారిగా పల్టీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

వియత్నాం రాజధాని హనోయీ నుంచి 20 మంది చిన్నారులతోకూడిన కొన్ని కుటుంబాలు సైతం ఇదే పడవలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని వీఎన్‌ ఎక్స్‌ప్రెస్‌ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. హా లాంగ్‌ బే ప్రాంతాన్ని ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడం తెల్సిందే. సతతహరిత అరణ్యాలకు, అందమైన నీలిరంగు బీచ్‌లకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. వారాంతం కావడంతో ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువైందని తెలుస్తోంది.రెండేళ్ల క్రితం సైతం హా లాంగ్‌ బే సమీప ఖ్వాంగ్‌నిన్‌ ప్రావిన్సును యాగీ టైఫన్‌ అతలాకుతలం చేసంది. ఆనాడు ఈ ప్రావిన్సులో 30 పడవలు బోల్తాపడి నీటమునిగాయి. ఈ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారడం సాధారణమని ఇక్కడి స్థానికులు చెప్పారు. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత పర్యాటకులు మరింత అప్రమత్తంగా ఉండి తమ పర్యాటక షెడ్యూల్‌ను మార్చుకోవాలని స్థానికులు సూచించారు. వచ్చే వారం హా లాంగ్‌ బే తీర ప్రాంతాన్ని విఫా తుపాను తాకొచ్చని జాతీయ వాతావరణ అంచనా విభాగం ప్రకటించింది.

The post తుపానులో చిక్కుకున్న పడవ…30 మంది జలసమాధి appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/international/%e0%b0%a4%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%b5/feed/ 0
సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు. https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be-%e0%b0%9a%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be-%e0%b0%9a%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5/#respond Sun, 20 Jul 2025 03:37:41 +0000 https://sample.webdigitalway.com/?p=1861 కర్నూలు నగరంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న 24 మంది విద్యార్థులు నాసా ఒమాలయా ప్రాజెక్ట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభా చాటారు. అందులో 12 మంది విద్యార్థులు నాసాలో జాతీయ స్థాయిలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు. జాతీయ నాసా స్థాయిలో రెండవ స్థానంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఉద్దేశించి శ్రీ చైతన్య పాఠశాల ఎజిఎం సురేష్ విద్యార్థులకు నాసా వారు పంపిన షీల్డెలను అందచేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం […]

The post సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు. appeared first on TeluguTimesNews.

]]>
కర్నూలు నగరంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న 24 మంది విద్యార్థులు నాసా ఒమాలయా ప్రాజెక్ట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభా చాటారు. అందులో 12 మంది విద్యార్థులు నాసాలో జాతీయ స్థాయిలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు. జాతీయ నాసా స్థాయిలో రెండవ స్థానంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఉద్దేశించి శ్రీ చైతన్య పాఠశాల ఎజిఎం సురేష్ విద్యార్థులకు నాసా వారు పంపిన షీల్డెలను అందచేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను అంతరీక్ష పరిశోధన రంగంలో విజ్ఞానాభివృద్ధి సాధించడానికి ఇటువంటి నాసా కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాఠశాల ఆర్ ఐ వేంకటేశర్లు , ప్రిన్సిపాల్ అన్నపూర్ణమ్మ , కోఆర్డినేటర్ రమణయ్య , అకాడమిక్ డీనే లోకేశ్వర్ రెడ్డి , నాసా ఇంచార్జ్ లావణ్య , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

The post సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థులు. appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%be-%e0%b0%9a%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b5/feed/ 0
ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/#respond Wed, 16 Jul 2025 05:49:45 +0000 https://sample.webdigitalway.com/?p=1858 శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. […]

The post ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. appeared first on TeluguTimesNews.

]]>
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి.

నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ

అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో అనంత జట్టు ఆదిక్యం సాధించింది.
ఆల్ రౌండ్ జై కృష్ణ 50 పరుగులు సాధించి జట్టు ఆశలను సజీవం చేశారు. మరోవైపు సెంచరీ తో ఫర్హాద్ ఖాద్రి చెలరేగిపోయాడు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న సీనియర్ మెన్ నాలుగో రౌండ్ మల్టీ డే క్రికెట్ పోటీల్లో అనంతపురం నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది .ఈ పోటీల్లో విజేతగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అనంతపురం జట్టు పోరాడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆల్ అవుట్ అయిన నెల్లూరుకు జవాబుగా అనంతపురం జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించింది . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించడంలో అనంతపురం జట్టు ఆల్రౌండర్లు జై కృష్ణ ,బి ఎస్ వినయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కష్టతరమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో వీరిద్దరూ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు ఆశలు సజీవమయ్యాయి. అద్భుతమైన పోరాట ప్రతిభ కనబరిచిన జై కృష్ణ అర్థ సెంచరీ సాధించగా, జై కృష్ణకు మార్గ నిర్దేశం చేసిన కెప్టెన్ వినయ్ కుమార్ కీలకమైన నలభై పరుగులు సాధించాడు. సెలక్టర్లు, జట్టు కెప్టెన్ మరియు సీనియర్ సభ్యులు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న జై కృష్ణ నాలుగు వికెట్లు తీయడమే కాకుండా కీలకమైన తొలి ఇన్నింగ్స్ లో ఆదిక్యం సాధించడంలో కీలక భూమిక పోషించి క్రికెట్ అభిమానుల అభిమానాన్ని పొందారు . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం కోల్పోయిన నెల్లూరు జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో వన్డే తరహా ఆట తీరును ప్రదర్శిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 53 ఓవర్లలో 245 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జట్టు బ్యాట్స్మెన్ ఫర్హాద్ ఖాద్రి , రోషన్ పవన్ కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫర్హాద్ ఖాదరి 118 బంతుల్లో 111 పరుగులు సాధించగా, రోషన్ పవన్ కుమార్ 104 బంతుల్లో 71 పరుగులు సాధించారు.
ఈ అంచె పోటీల్లో విజేతగా నిలవాలంటే అనంతపురం జట్టు ఈ మ్యాచ్ లో అవుట్రేట్ విజయం సాధించడంతోపాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవలసి ఉంటుంది. నాలుగు మ్యాచ్ల్లు ఆడిన చిత్తూరు జట్టు 16 పాయింట్లు సాధించడం తోపాటు మెరుగైన రన్ రేట్ తో ప్రస్తుతం టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. బుధవారం ఈ పోటీలకు ఆఖరి రోజు.

The post ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/feed/ 0
మహిళను నమ్మించి మోసం చేసిన వీఆర్వో. https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8/#respond Wed, 16 Jul 2025 03:31:48 +0000 https://sample.webdigitalway.com/?p=1855 గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు. గత రెండేళ్లుగా ఆమెతో సాన్నిహిత్యంగా ఉండి ఇప్పుడు మొహం చాటేసాడు. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న మహిళ తో కాపురం చేసేదే లేదని బెదిరిస్తున్నాడు. అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నిత్యం ఎక్కడో చోట మహిళలను మోసం చేసిన వార్తలు వింటూనే ఉంటాం. ప్రస్తుతం సమాజంలో ఈ అంశం నిత్య కృత్యమైంది. ఇలాంటి […]

The post మహిళను నమ్మించి మోసం చేసిన వీఆర్వో. appeared first on TeluguTimesNews.

]]>
గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు. గత రెండేళ్లుగా ఆమెతో సాన్నిహిత్యంగా ఉండి ఇప్పుడు మొహం చాటేసాడు. ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న మహిళ తో కాపురం చేసేదే లేదని బెదిరిస్తున్నాడు. అంశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
నిత్యం ఎక్కడో చోట మహిళలను మోసం చేసిన వార్తలు వింటూనే ఉంటాం. ప్రస్తుతం సమాజంలో ఈ అంశం నిత్య కృత్యమైంది. ఇలాంటి వంచనే అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటుచేసుకుంది. 24వ సచివాలయంలో వీఆర్వో గా పని చేసే వలి ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం వచ్చిన ఓ మహిళను మాయమాటలతో నమ్మించారు. కల్లబొల్లి మాటలు చెప్పి పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే తనకు పెళ్లి అయినట్టు బాధితురాలికి చెప్పకుండా గుట్టుగా వ్యవహారం నడిపాడు. అయితే అవసరం తీరిపోయాక ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న బాధితురాలిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చంపుతామని కుటుంబ సభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఇప్పుడు తన భార్య ఒప్పుకోవడం లేదని బుకాయిస్తున్నాడు. దీంతో చేసేది లేక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సురేష్ నేతృత్వంలో స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని.. నమ్మించి మోసం చేసిన విఆర్ఓ వలితోపాటు తనను చంపుతామని బెదిరిస్తున్న వలి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ మనోహర్ బాధితురాలికి హామీ ఇచ్చారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం: సురేష్

పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఏడు నెలల గర్భవతిగా ఉన్న బాధితురాలిని వదిలించుకునేందుకు వీఆర్వో వలి ప్రయత్నిస్తున్నాడని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా సహాయం చేస్తా వదిలిపెట్టాలని పెద్ద మనుషుల ద్వారా వీఆర్వో వలి దుప్పటి పంచాయతీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అవసరమైతే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మహిళలను మోసం చేసిన వీఆర్వో వలీపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కలిసి విన్నవిస్తామని తెలిపారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదన్నారు.

The post మహిళను నమ్మించి మోసం చేసిన వీఆర్వో. appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8/feed/ 0
మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%82%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%b0/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%82%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%b0/#respond Sat, 21 Jun 2025 02:55:11 +0000 https://sample.webdigitalway.com/?p=1851 కర్నూలు  : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు డీఈఓ కి శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ధనమే ధ్యేయంగా ఫీజుల […]

The post మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి appeared first on TeluguTimesNews.

]]>
కర్నూలు  : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు డీఈఓ కి శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ధనమే ధ్యేయంగా ఫీజుల దోపిడి చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు నగరంలో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా పరీక్షల ఒత్తిడి తీసుకొస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో అంగట్లో సర్కుల్లాగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టై లు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని అన్నారు. కావున తక్షణమే విద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు అస్లాం భాష, రవి తదితరులు పాల్గొన్నారు.

The post మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%82%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%88-%e0%b0%9a%e0%b0%b0/feed/ 0
ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…? https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%8f%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-1-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%8f%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-1-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a/#respond Sat, 29 Mar 2025 06:56:49 +0000 https://sample.webdigitalway.com/?p=1567 ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం అమలులోకి రానుంది. ఈ సందర్భంగా పార్కింగ్ రుసుముల వసూలును నియంత్రించేందుకు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్‌కు ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని సోమవారం స్పష్టం చేశారు. ఈ నియమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. […]

The post ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…? appeared first on TeluguTimesNews.

]]>
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం అమలులోకి రానుంది. ఈ సందర్భంగా పార్కింగ్ రుసుముల వసూలును నియంత్రించేందుకు మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లలో మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్‌కు ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదని సోమవారం స్పష్టం చేశారు. ఈ నియమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సంతోషకరమైన వార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద వాహన పార్కింగ్ ఫీజులను క్రమబద్ధీకరించేందుకు ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇష్టానుసారంగా రుసుములు వసూలు చేయకుండా నియంత్రణలు విధించింది. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఈ విషయంలో ఎప్పుడు, ఎలా రుసుములు వసూలు చేయాలో నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం, మొదటి 30 నిమిషాల వరకు పార్కింగ్ ఉచితంగా ఉంటుందని స్పష్టం చేశారు.

మల్టీప్లెక్స్‌లు మరియు మాల్స్‌లో 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు వాహనాలు పార్క్ చేసినప్పుడు, ఆ సమయంలో ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లు బిల్లు చూపిస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేయరని తెలిపారు. అయితే, బిల్లు చూపించలేని వారి నుంచి మాత్రం పార్కింగ్ రుసుములు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఒక గంటకు మించి పార్కింగ్ చేసిన వారు సినిమా టికెట్ లేదా ఇతర బిల్లులు చూపిస్తే కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎలాంటి ఆధారాలు చూపని వారి నుంచి రుసుములు వసూలు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ రుసుముల మొత్తం ఎంత ఉండాలనే విషయంపై పురపాలక శాఖ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ నియమాలను వాహనదారులు గమనించాలని అధికారులు కోరారు.

The post ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…? appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%8f%e0%b0%aa%e0%b1%80-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%8f%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-1-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a/feed/ 0
జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b0%82/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b0%82/#respond Thu, 13 Feb 2025 01:53:44 +0000 https://sample.webdigitalway.com/?p=1557 అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం, పక్కా ఇళ్లు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నాటి […]

The post జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి appeared first on TeluguTimesNews.

]]>
అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి
హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు

కర్నూలు : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం, పక్కా ఇళ్లు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నాటి టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టుల పక్కా ఇళ్లు, సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించిందని అన్నారు. అమరావతిలో రాష్ట్ర బ్యూరో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఐదేళ్లు ఐదేళ్లు పట్టించుకోలేదు చివర్లో జర్నలిస్టుల ఇళ్ల పథక కింద 60:40 శాతం ఇళ్ల స్థలాలు కొనుగోలు నిధులు ఇస్తామన్నారు. ఒక్క ఎకరా కొనుగోలు చేయలేదు అన్నారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. దీనిపై ఓ కమిటీ వేస్తామని అన్నారు. జర్నలిస్టులకు పింఛన్ స్కీం అమలు చేయాలి, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి,ఇంటి స్థలాలు.. పక్కా ఇళ్లు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభల నాటికి ప్రభుత్వం మంజూరు చేయకపోతే ఆందోళన కార్యచరణ తయారు చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యా అందించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించారని అన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటుపై జిల్లా కమిటీ దృష్టి సారించాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో కొంత మొత్తం జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై పోరాటాలకు సిద్ద పడాలని అన్నారు. జర్నలిస్టులు కూడా కుటుంబం, భార్య పిల్లల సంక్షేమం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ సలహాదారులు సుబ్బయ్య, ఐజేయూ అధ్యక్ష, కార్యదర్శులు ఈఎన్ రాజు, శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, సీనియర్ జర్నలిస్టు హరికిషన్ తదితరులు మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా రెండవ పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికైన ఐవీ సుబ్బారావును ఘనంగా సత్కరించారు. అలాగే.. రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నికైన దేవేంద్ర, భీమన్న, మధులను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అంజి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు శివ, స్వరూప్, నూర్, గిరి, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ అధ్యక్షులు శ్రీనివాసులు, పరమేశ్ జయరాజ్,సాలురంగడు తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా హడహక్ కమిటి కన్వీనర్ గా హరికిషన్

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ గా సీనియర్ జర్నలిస్టు హరికిషన్ ను రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ప్రకటించారు. సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు మధు, సుంకన్న, శివలను ఎన్నుకున్నారు. ఈ కమిటీ జిల్లాలో పర్యటించి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, త్వరలోనే జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

దివంగత చిన్నకు ఘన నివాళి : ఇటీవల గుడెపోటుకు గురై హఠాన్మరణం చెందిన ఏబీఎన్ స్టాఫ్ కెమెరామెన్ జె. సురేంద్రబాబు (చిన్న)కు ఘనంగా నివాళులు అర్పించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అందించారు. చిన్న, ఇటివల గుండెపోటుతో మరణించిన విశాలాంధ్ర రిపోర్టర్ హనుమంతన్నల సేవలు కొనియాడారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు నాగరాజు తదితరులు చిన్న కుటుంబం సభ్యులను పరామర్శించారు.

The post జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b0%82/feed/ 0
యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ https://sample.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/ https://sample.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/#respond Mon, 10 Feb 2025 03:24:38 +0000 https://sample.webdigitalway.com/?p=1554 కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక […]

The post యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ appeared first on TeluguTimesNews.

]]>
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగా సాధన కోసం ప్రత్యేకంగా తరగతులను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చర్వతో ప్రపంచ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచానికి ఆరోగ్య సంపదను అందిస్తున్నామని అన్నారు. అనంతరం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత 13 సంవత్సరాల నుంచి యోగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందమందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణిస్తున్నారని అన్నారు. ఈనెల 13 నుంచి 16 వరకు కేరళలో జరగబోయే 49వ జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కల్లూరు ఏం.ఈ.ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను యోగ సాధన వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చదువుతోపాటు యోగాలో సాధన చేయిస్తే క్రమశిక్షణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వేదాన్షి పాఠశాల కి రెస్పాండెంట్ పరమేష్, అనంతపూర్ జిల్లా యోగ సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జాతీయ యోగ సంఘం టెక్నికల్ అఫీషియల్స్ డాక్టర్ ముంతాజ్ బేగం,విజయ్ కుమార్,ఈశ్వర్ నాయుడు,జిల్లా సంఘం ప్రతినిధులు ఫయాజ్,పద్మలత, పోటీల నిర్వాహక అధ్యక్షుడు విద్యాసాగర్, వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

The post యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/feed/ 0
దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ : పవన్ కళ్యాణ్ https://sample.webdigitalway.com/uncategorized/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%87-%e0%b0%a4%e0%b0%b2%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%82-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d/ https://sample.webdigitalway.com/uncategorized/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%87-%e0%b0%a4%e0%b0%b2%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%82-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d/#respond Sun, 12 Jan 2025 04:37:33 +0000 https://sample.webdigitalway.com/?p=1542 ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్. ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ఇలా మూడు విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన విధానం అద్భుతం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ అవసరాల్లో మూడో వంతు తీర్చవచ్చు. ఈ మెగా పవర్ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేల మంది వరకు […]

The post దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ : పవన్ కళ్యాణ్ appeared first on TeluguTimesNews.

]]>
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్. ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ఇలా మూడు విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన విధానం అద్భుతం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ అవసరాల్లో మూడో వంతు తీర్చవచ్చు. ఈ మెగా పవర్ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 వేల మంది వరకు ఉపాధి లభిస్తుంద’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి రంగంలో శిలాజ ఇంధనాల బదులు పునరుత్పాదక శక్తి ఇంధన విభాగమే ముందంజలో ఉంటుందని, గ్రీన్ పవర్ ఉత్పత్తి విషయంలో దేశానికే ఈ ప్రాజెక్ట్ ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను పరిశీలించారు. సోలార్ పార్క్, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సైట్ ను ఏరియల్ వ్యూ ద్వారా అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాష్ట్రానికే పేరు తెచ్చే ప్రాజెక్టు ఇది. రాళ్లు, రప్పల్లో 10వేల మందికి ఉపాధి కల్పించారు. ఇప్పటి వరకు మన దేశంలో గ్రీన్ కో సంస్థ రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టింది. మన రాష్ట్రంలో రూ.30 వేల కోట్లు పెట్టుబడులుపెట్టారు. మరో రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పిన్నాపురం ప్రాజెక్టులోనే దాదాపు రూ. 12వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు. మరో రూ. 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 12 వేల మందికి ఉపాధి కల్పించారు.

వివాదం పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఐటీ తరవాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది గ్రీన్ ఎనర్జీ పరిశ్రమపైనే చలమలశెట్టి అనిల్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే వెంటనే మొదలు పెట్టాలని ఎంకరేజ్ చేశారు. చాలా తక్కువ కాల వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. మొత్తం 2,800 ఎకరాల్లో నిర్మిస్తోన్న ప్రాజెక్టు ఇది. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదు. 2800 ఎకరాల్లో 1700 ఎకరాలను ప్రభుత్వం, రైతుల నుంచి గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది. కేంద్రం అనుమతితోనే 365 హెక్టార్ల అటవీ భూమిని సంస్థ కొనుగోలు చేసింది. అందుకు నెల్లూరులో రూ.36 కోట్ల విలువైన భూమిని సంస్థ ప్రభుత్వానికి ఇచ్చింది. ఫారెస్టు, రెవెన్యూ మధ్య 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉంది. 1962 నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఈ భూమి మాదంటే మాది అని రెవెన్యూ, అటవీ శాఖలు అంటున్నాయి. అందులో 11.49 ఎకరాలు రైతుల నుంచి గ్రీన్‌కో కంపెనీ కొనుగోలు చేసింది. ఈ వివాదం పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించాం. అలాగే వివాద పరిష్కారానికి మా వంతు సహకారం అందిస్తామన్నారు.

గొప్ప పర్యాటక కేంద్రంగా మారనుంది
కొద్దిసేపటి క్రితమే ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టును పరిశీలించాను. గని సోలార్‌ పార్క్, పంప్డ్‌ స్టోరేజ్‌, పవర్ హౌస్ చూశాను. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు గొప్ప పర్యాటక కేంద్రంగా, విజ్ఞాన కేంద్రంగా మారబోతోంది. వేలాది మంది ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో చిన్న చిన్న వివాదాలు ఉంటే మా ప్రభుత్వం తరఫున సహకరించి పరిష్కరిస్తాం. సీఎస్‌ఆర్‌ కింద గ్రీన్ కో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. పాఠశాల అభివృద్ధి, సేంద్రియ సాగు, గో సంతతి పెంచేలా చూడాలని నా తరఫున కోరుతున్నాను, అలాగే కర్నూలు, కడప జిల్లాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని మా దృష్టికి వచ్చింది. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తాం. ఎవరైతే ప్రభుత్వ, అటవీ భూములు అక్రమించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

స్వయంగా కారు నడుపుతూ ప్రాజెక్ట్ పరిశీలన

మధ్యాహ్నం 12 గం.కు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఓర్వకల్లు, గని సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుతో సహా పిన్నాపురం, గుమ్మటంతాండ గ్రామాల మధ్య నిర్మించిన పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టును ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం అప్పర్‌ రిజర్వాయర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అప్పర్‌ ఇన్‌టెక్‌ వ్యూ పాయింట్‌ వద్ద ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా కారు నడుపుతూ పవర్‌ హౌస్‌కు చేరుకున్నారు. ప్రాజెక్టు వివరాలను సంబంధిత అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా పవన్ కళ్యాణ్ కి వివరించారు. ప్రాజెక్టులో పని చేసే కార్మికులతో సరదాగా ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బి.సి.జనార్ధన రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీలు బిందు మాధవ్, ఆదిరాజ్ సింగ్ రాణా, గ్రీన్ కో కంపెనీ ఎండీ చలమలశెట్టి అనిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

The post దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ : పవన్ కళ్యాణ్ appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/uncategorized/%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%87-%e0%b0%a4%e0%b0%b2%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%82-%e0%b0%87%e0%b0%82%e0%b0%9f%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d/feed/ 0
అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించిన.. పి ఆర్ ఆర్ విద్యార్థికి సన్మానం https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%85%e0%b0%a5%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9b%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b7/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%85%e0%b0%a5%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9b%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b7/#respond Wed, 11 Dec 2024 04:20:54 +0000 https://sample.webdigitalway.com/?p=1525 గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల విద్యార్థులు ఎస్కేయూ లో నిర్వహించినటువంటి క్రీడలలో పాల్గొని అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించారు. పెనుగొండ పరిధిలో నిడిమామిడి జడ్పీహెచ్ స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ పవన్ కుమార్ , కృష్ణవేణి దంపతుల కుమారుడు పి ఆర్ ఆర్ ఎం బి ఏ కళాశాలలో ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న జై సాయి సుభాష్ రెండు గోల్డ్ మెడల్స్ రెండు సిల్వర్ మెడల్స్ ను ఒక బ్రోంజ్ ఏకంగా ఐదు […]

The post అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించిన.. పి ఆర్ ఆర్ విద్యార్థికి సన్మానం appeared first on TeluguTimesNews.

]]>
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల విద్యార్థులు ఎస్కేయూ లో నిర్వహించినటువంటి క్రీడలలో పాల్గొని అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించారు. పెనుగొండ పరిధిలో నిడిమామిడి జడ్పీహెచ్ స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ పవన్ కుమార్ , కృష్ణవేణి దంపతుల కుమారుడు పి ఆర్ ఆర్ ఎం బి ఏ కళాశాలలో ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న జై సాయి సుభాష్ రెండు గోల్డ్ మెడల్స్ రెండు సిల్వర్ మెడల్స్ ను ఒక బ్రోంజ్ ఏకంగా ఐదు మెడల్స్, అథ్లెటిక్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగినది . అదేవిధంగా ఇదే కళాశాలకు చెందినటువంటి మొదటి సంవత్సరం విద్యార్థిని త్రివేణి క్రీడలలో పాల్గొని జవిలిన్ బ్రోంజ్ మెడల్ సాధించింది . ఈ సందర్భంగా పిఆర్ఆర్ ఎంబీఏ కళాశాల యాజమాన్యం పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి, క్యాంపస్ ఇంచార్జ్ సంతోష్ కుమార్ రెడ్డి విద్యార్థులను అభినందించడం జరిగినది. ఈ సందర్భంగా కళాశాల నందు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జై సాయి శుభాష్ కు పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా చాలా అవసరం అని క్రీడారంగం వైపు ప్రతిభ కలిగిన విద్యార్థులకు, తమ సహకారం ఉంటుందని, విద్యార్థులకు ప్రభుత్వ రంగాలలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుందని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు చాలా అవసరం అని మహోన్నత స్థాయి కూడా క్రీడలు ఒక వ్యక్తిని తీసుకుపోయే కలిగే సత్తా ఉంది అని విద్యను ఒకవైపు క్రీడను ఒకవైపు రెండు కల్లులా విద్యార్థులు చూసుకోవాలని, మెడల్స్ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరెన్నో విజయాలు సాధించాలని పిలుపునివ్వడం జరిగినది. అనంతరం జై సాయి సుభాష్ ను శాలువాతో సన్మానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా క్రీడాకారుడు జై సాయి సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని క్రీడలు మానసిక ఆనందాన్ని ఇస్తుందని అదేవిధంగా క్రీడారంగంలో మంచి ఉన్నత స్థాయికి రావాలని పిలుపునివ్వడం జరిగింది.

The post అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించిన.. పి ఆర్ ఆర్ విద్యార్థికి సన్మానం appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%85%e0%b0%a5%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9b%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%af%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b7/feed/ 0