క్రీడలు – TeluguTimesNews https://sample.webdigitalway.com Wed, 16 Jul 2025 05:49:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/ https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/#respond Wed, 16 Jul 2025 05:49:45 +0000 https://sample.webdigitalway.com/?p=1858 శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. […]

The post ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. appeared first on TeluguTimesNews.

]]>
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి.

నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ

అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో అనంత జట్టు ఆదిక్యం సాధించింది.
ఆల్ రౌండ్ జై కృష్ణ 50 పరుగులు సాధించి జట్టు ఆశలను సజీవం చేశారు. మరోవైపు సెంచరీ తో ఫర్హాద్ ఖాద్రి చెలరేగిపోయాడు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న సీనియర్ మెన్ నాలుగో రౌండ్ మల్టీ డే క్రికెట్ పోటీల్లో అనంతపురం నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది .ఈ పోటీల్లో విజేతగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అనంతపురం జట్టు పోరాడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆల్ అవుట్ అయిన నెల్లూరుకు జవాబుగా అనంతపురం జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించింది . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించడంలో అనంతపురం జట్టు ఆల్రౌండర్లు జై కృష్ణ ,బి ఎస్ వినయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కష్టతరమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో వీరిద్దరూ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు ఆశలు సజీవమయ్యాయి. అద్భుతమైన పోరాట ప్రతిభ కనబరిచిన జై కృష్ణ అర్థ సెంచరీ సాధించగా, జై కృష్ణకు మార్గ నిర్దేశం చేసిన కెప్టెన్ వినయ్ కుమార్ కీలకమైన నలభై పరుగులు సాధించాడు. సెలక్టర్లు, జట్టు కెప్టెన్ మరియు సీనియర్ సభ్యులు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న జై కృష్ణ నాలుగు వికెట్లు తీయడమే కాకుండా కీలకమైన తొలి ఇన్నింగ్స్ లో ఆదిక్యం సాధించడంలో కీలక భూమిక పోషించి క్రికెట్ అభిమానుల అభిమానాన్ని పొందారు . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం కోల్పోయిన నెల్లూరు జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో వన్డే తరహా ఆట తీరును ప్రదర్శిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 53 ఓవర్లలో 245 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జట్టు బ్యాట్స్మెన్ ఫర్హాద్ ఖాద్రి , రోషన్ పవన్ కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫర్హాద్ ఖాదరి 118 బంతుల్లో 111 పరుగులు సాధించగా, రోషన్ పవన్ కుమార్ 104 బంతుల్లో 71 పరుగులు సాధించారు.
ఈ అంచె పోటీల్లో విజేతగా నిలవాలంటే అనంతపురం జట్టు ఈ మ్యాచ్ లో అవుట్రేట్ విజయం సాధించడంతోపాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవలసి ఉంటుంది. నాలుగు మ్యాచ్ల్లు ఆడిన చిత్తూరు జట్టు 16 పాయింట్లు సాధించడం తోపాటు మెరుగైన రన్ రేట్ తో ప్రస్తుతం టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. బుధవారం ఈ పోటీలకు ఆఖరి రోజు.

The post ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు. appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/andhrapradesh/%e0%b0%89%e0%b0%a4%e0%b1%8d%e0%b0%95%e0%b0%82%e0%b0%a0-%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b1%81%e0%b0%a4%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf/feed/ 0
యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ https://sample.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/ https://sample.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/#respond Mon, 10 Feb 2025 03:24:38 +0000 https://sample.webdigitalway.com/?p=1554 కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక […]

The post యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ appeared first on TeluguTimesNews.

]]>
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్,రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి లు అన్నారు. ఆదివారం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్దపాడు లోని వేదాన్షి పాఠశాల నందు ఒకటవ రాష్ట్ర స్థాయి యోగ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో యోగా సాధన కోసం ప్రత్యేకంగా తరగతులను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చర్వతో ప్రపంచ వ్యాప్తంగా యోగా డే కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచానికి ఆరోగ్య సంపదను అందిస్తున్నామని అన్నారు. అనంతరం యోగ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత 13 సంవత్సరాల నుంచి యోగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వందమందికి పైగా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణిస్తున్నారని అన్నారు. ఈనెల 13 నుంచి 16 వరకు కేరళలో జరగబోయే 49వ జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కల్లూరు ఏం.ఈ.ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను యోగ సాధన వైపు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. చదువుతోపాటు యోగాలో సాధన చేయిస్తే క్రమశిక్షణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, వేదాన్షి పాఠశాల కి రెస్పాండెంట్ పరమేష్, అనంతపూర్ జిల్లా యోగ సంఘం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జాతీయ యోగ సంఘం టెక్నికల్ అఫీషియల్స్ డాక్టర్ ముంతాజ్ బేగం,విజయ్ కుమార్,ఈశ్వర్ నాయుడు,జిల్లా సంఘం ప్రతినిధులు ఫయాజ్,పద్మలత, పోటీల నిర్వాహక అధ్యక్షుడు విద్యాసాగర్, వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

The post యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్ appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/sports/%e0%b0%af%e0%b1%8b%e0%b0%97-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%b8%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a3-%e0%b0%86/feed/ 0
నేడు సౌతాఫ్రికా-భారత్ రెండో టీ20.. https://sample.webdigitalway.com/sports/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a4%e0%b0%be%e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86/ https://sample.webdigitalway.com/sports/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a4%e0%b0%be%e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86/#respond Sun, 10 Nov 2024 18:28:35 +0000 https://sample.webdigitalway.com/?p=102 గ్కేబెర్హా: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి జోరుమీదున్న భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉంది. ఆతిథ్య సౌతాఫ్రికా కూడా గెలుపే లక్షంతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకువాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. సంజు జోరు సాగాలి.. తొలి టి20లో విధ్వంసక శతకంతో చెలరేగి […]

The post నేడు సౌతాఫ్రికా-భారత్ రెండో టీ20.. appeared first on TeluguTimesNews.

]]>
గ్కేబెర్హా: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి జోరుమీదున్న భారత్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో ఉంది. ఆతిథ్య సౌతాఫ్రికా కూడా గెలుపే లక్షంతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకువాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
సంజు జోరు సాగాలి..
తొలి టి20లో విధ్వంసక శతకంతో చెలరేగి పోయిన ఓపెనర్ సంజు శాంసన్‌పై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా రెండు టి20 మ్యాచుల్లో సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన సంజు హ్యాట్రిక్ శతకాలపై కన్నేశాడు. ముచ్చటగా మూడో టి20 శతకంతో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోవాలని తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సంజు సొంతం. అతను తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఆపడం ప్రత్యర్థి టీమ్ బౌలర్లకు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పాలి. శాంసన్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. సంజు విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగితే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అభిషేక్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఐపిఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించిన అభిషేక్ టీమిండియాలో అనూహ్యంగా చోటు దక్కింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. రెండో టి20లో మెరుగ్గా ఆడకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. తొలి టి20లో సూర్యకుమార్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈసారి మాత్రం మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలని భావిస్తున్నాడు. టి20 స్పెషలిస్ట్‌గా పేరున్న సూర్యకుమార్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టాలు ఖాయం.
ఇదే మంచి ఛాన్స్..
మరోవైపు టీమిండియాలో స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్న యువ ఆటగాళ్లకు ఇదే మంచి ఛాన్స్‌గా చెప్పాలి. రింకు సింగ్, తిలక్‌వర్మ, అభిషేక్ శర్మ తదితరులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సిరీస్‌లో రాణిస్తే రానున్న రోజుల్లో జాతీయ జట్టులో చోటు కాపాడుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో యువ ఆటగాళ్లు ఛాన్స్ వృథా చేసుకోకూడదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇదిలావుంటే తొలి టి20లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అవేశా ఖాన్, అర్ష్‌దీప్ తదితరులు మెరుగైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
పరీక్షలాంటిదే..
ఇక, ఆతిథ్య సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ పరీక్షలాంటిదేనని చెప్పాలి. యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌ను ఓడించాలంటే సఫారీ టీమ్ ఒడ్డి పోరాడక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ మార్‌క్రమ్‌పై నెలకొంది. ఓపెనర్లు మార్‌క్రమ్, రియాన్ రికెల్టన్‌లు శుభారంభం అందించక తప్పదు. ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, క్రుగర్, మార్కొ జాన్సెన్ తదితరులతో సౌతాఫ్రికా చాలా బలంగా ఉంది. అయితే సమష్టిగా రాణించడంలో విఫలమవుతోంది. ఈ మ్యాచ్‌లో మాత్రం పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.

The post నేడు సౌతాఫ్రికా-భారత్ రెండో టీ20.. appeared first on TeluguTimesNews.

]]>
https://sample.webdigitalway.com/sports/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b8%e0%b1%8c%e0%b0%a4%e0%b0%be%e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%86/feed/ 0